నియామక ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం
సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది.కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ సిఫారసులను కేంద్రం అనుమతించగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి నియమాకం ఫైలుపై గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. కాగా సుప్రీంకోర్టు కొత్త జడ్జిలపై కేంద్రం నేడు సాయంత్రం గెజిట్ను విడుదల చేయనుంది.సుప్రీంకోర్టు కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమ కోహ్లి, బీవీ నాగరత్న, జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ జెకె. మహేశ్వరి, జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ నాగార్జున ఉన్నారు.