Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఎన్డ్డీఆర్‌ఎఫ్‌ నిధులు వెనక్కి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు మళ్లించిన ఎన్డ్డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌) నిధులను వెనక్కి ఇచ్చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు రెండు వారాల గడువు విధించింది. సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ న్యాయవాది సమ్మతం తెలిపారు. నిధులు వెనక్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడిరచారు. అయితే, ఇంకా కొన్ని కరోనా బాధిత కుటుంబాలకు సాయం అందాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకోగా, ఆ విషయం పరిష్కార కమిటీకి నివేదించాలని స్పష్టం చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయించిన సొమ్ములోంచి ఏపీ సర్కారు రూ.1,100 కోట్లు దారి మళ్లించిందంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అప్పట్లో దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ సీఎస్‌ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోనూ ఏపీ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img