Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత..ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున కన్నుమూశారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు జామున ఇందిరాదేవి గారు తుదిశ్వాస విడిచారు.ఇందిరాదేవి మరణవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాతృవియోగంతో బాధపడుతున్న మహేష్‌ బాబుకు సంతాపం తెలియజేస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో ఇందిరాదేవి పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img