Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సోనియాకు రాజీనామా లేఖ పంపిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ..


పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఈ లేఖను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పంజాబ్‌ పీసీసీ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షురాలిని ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. టీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్ష బాధ్యతలను సోనియానే నిర్వహించాలంటూ తీర్మానించడం తెలిసిందే. అందుకు ఆమె అంగీకరించారు. ఆ వెంటనే ఐదు రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్‌ ల రాజీనామాకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాల్లోనూ పార్టీ రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాలంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలి ఆదేశంతో సిద్ధూ రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img