బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో సౌరవ్ గంగూలీ ఐసోలేషన్లో ఉన్నారు.సౌరవ్ గంగూలీకి కరోనా సోకిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా సోమవారం అర్దరాత్రి ఆసుపత్రికి తరలించారు.గంగూలీ రెండు డోసుల టీకాలు వేయించుకున్నప్పటికీ క్రికెట్ కార్యకలాపాల్లో భాగంగా విస్తృతంగా పర్యటిస్తుండటంతో కరోనా బారిన పడ్డారు.గంగూలీని వుడ్ ల్యాండ్స్ నర్సింగ్ హోంకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గతంలో గంగూలీ కుటుంబసభ్యులు సైతం ఈ వైరస్ బారినపడ్డారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో గంగూలీ స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టి చేశారు.