రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలకి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. దీంతో అతి త్వరలో ఈ టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ప్రయోగాల్లో పాల్గొనే వారి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఈ వారంలోనే పారంభించనున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నియంత్రణ కోసం రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈ స్పుత్నిక్ లైట్ ఒక్క డోసు టీకాను అభివృద్ధి చేసింది. ఇది కరోనాపై 78.6 శాతం నుంచి 83.7శాతం సమర్థతతో పనిచేస్తుందని ఆర్డీఐఎఫ్ వెల్లడిరచింది. దీన్ని భారత్లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ రష్యాతో ఒప్పందం చేసుకుంది.