Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 35,499 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. అలాగే మరణాల్లో కూడా తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 9 శాతం మేర తగ్గాయి. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. కరోనాతో 447 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 50,86,64,759 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img