దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 507 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,18,987 చేరుకుంది. చికిత్స నుంచి కోలుకుని 38,652 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కి చేరింది. ఇందులో 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 38,652 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,29,339కి చేరింది. కాగా ఇప్పటిదాకా 41,78,51,151 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.