Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

కొత్తగా 11,919 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత కొద్దికాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.బుధవారం 10,197 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 12 వేలకు చేరువయ్యాయి. నిన్నటికంటే ఇది 15 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. తాజాగా 12,32,505 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..11,919 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,78,517కు చేరాయి. ఇందులో 3,38,85,132 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 1,28,762 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,64,623 మంది మృతిచెందారు. కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 11,242 మంది కరోనా నుంచి బయటపడగా, 470 మంది మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.37 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ఠమని తెలిపింది. ఇక నిన్న 73.4 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 114 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img