Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హాస్పిటళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే స్వీటెస్ట్‌ టెర్రరిస్టుని నేనే.. : కేజ్రీవాల్‌

హాస్పిటళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే స్వీటెస్ట్‌ టెర్రరిస్టుని తానే అని ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. పార్టీ మాజీ సహచరుడు కవి కుమార్‌ విశ్వాస్‌ చేసిన ఆరోపణలకు ధీటుగా కేజ్రీవాల్‌ కౌంటర్‌ ఇస్తూ ఇవాళ ఆయన ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ప్రపంచంలోనే స్వీటెస్ట్‌ టెర్రరిస్టుని తానే అని అన్నారు. వాళ్ల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వాటిని నమ్మితే నిజంగానే నేను ఉగ్రవాదిని అవుతానని, అలాంటప్పుడు గడిచిన పదేళ్ల నుంచి భద్రతా ఏజెన్సీలు ఏం చేస్తున్నట్లు అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. వందేళ్ల క్రితం కూడా భగత్‌ సింగ్‌ను బ్రిటీషర్లు ఉగ్రవాదిగా పిలిచారని, భగత్‌సింగ్‌ను తాను గుడ్డిగా ఫాలో అవుతానని, ఇప్పుడు మళ్లీ చరిత్ర తిరుగరాస్తున్నారని అన్నారు., అవినీతి నేతలంతా ఒక్కటై భగత్‌ సింగ్‌ను ఉగ్రవాదిగా పిలుస్తున్నట్లు కేజ్రీ అన్నారు. తనపై ఎన్‌ఐఏలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు ఓ ఆఫీసర్‌ తెలిపారని, రెండు రోజుల్లో ఆ కేసు ఫైల్‌ చేయనున్నట్లు తెలిసిందన్నారు. అలాంటి ఎఫ్‌ఐఆర్‌లను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img