Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో 13కి పెరిగిన మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నారు.ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారని, 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు14 మంది క్షతగాత్రులను రక్షించినట్లు తెలిపారు. మృతుల్లో చిన్నారి సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. కిన్నౌర్‌ జిల్లా రెకాంగ్‌ పియో ` సిమ్లా హైవేపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్ద పెద్ద బండరాళ్లు ఎత్తయిన కొండప్రాంతం నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడిరచారు. ప్రయాణసమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img