Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హెలికాప్టర్‌ ప్రమాదంపై రాజ్‌నాథ్‌ ప్రకటన

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌పై స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్‌ ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంట్‌ ఉభయసభల్లో నేడు ప్రకటన చేశారు.హెలికాప్టర్‌ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈ ప్రమాదంతో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి మృతి చెందారని రాజ్‌నాథ్‌ వెల్లడిరచారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్టర్‌పై ఉన్నట్లు వెల్లడిరచారు. హెలికాప్టర్‌ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని, భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారన్నారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢల్లీికి చేరుతాయన్నారు.శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు బృందం బుధవారమే వెల్లింగ్టన్‌ చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టిందని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img