టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కి మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్ టి64 విభాగంలో శుక్రవారం పోటీపడిన భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకాన్ని సాధించాడు.పారాలింపిక్స్లో ప్రవీణ్ కుమార్ పోటీపడటం ఇదే తొలిసారికాగా.. గ్రేట్ బ్రిటన్కి చెందిన బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10మీ జంప్తో పసిడి పతకాన్ని గెలుపొందాడు. నోయిడాకి చెందిన 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్కి కెరీర్లో ఇదే (2.07) అత్యుత్తమ ప్రదర్శన. అలానే భారత్ బృందంలో పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రవీణ్ నిలిచాడు.
ప్రవీణ్ కుమార్ను అభినందించిన ప్రధాని మోదీ
పారాలింపిక్స్లో రజతం సాధించిన ప్రవీణ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. పారాలింపిక్స్లో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించినందుకు గర్వపడుతున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అతని కృషి, పట్టుదలకు, అసమానమైన అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా అభినందించారు.