విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పాఠశాలలకు మే ఒకటోతేదీ నుంచి జూన్11 వరకు వేసవి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్.సురేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రతులను అన్ని పాఠశాలలు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ, మున్సిపల్ పరిపాలనా అధికారులకు పంపారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను అధికారులు హెచ్చరించారు.