దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తుగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా… 255 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 23,598 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,21,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,13,481గా ఉంది. ఇక నిన్న 28 లక్షల మంది టీకా తీసుకోగా, 13 నెలల వ్యవధిలో 177 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.