దేశంలో వ్యాక్సిన్నేషన్ ప్రక్రియలో భాగంగా 12-14 ఏండ్ల చిన్నారులకు బుధవారం నుంచి టీకాలు పంపిణీ చేస్తున్నారు. తొలిరోజు దేశవ్యాప్తంగా 2.6 లక్షల మందికి పైగా చిన్నారులు తమ మొదటి డోసును తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు ఇవ్వనున్నారు. హైదరాబాదీ సంస్థ బయోలాజికల్ ఈ సంస్థ తయారుచేసిన కార్బెవాక్స్ టీకాను చిన్నారులకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 2021, మార్చి 1 నాటికి 12 నుంచి 13 ఏండ్ల వయస్సు ఉన్న చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.