Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

15న మహిళా రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగుచట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలోని జింద్‌ జిల్లాలో భారీ ట్రాక్టర్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఆగస్ట్‌ 15ను రైతులు కిసాన్‌ మజ్దూర్‌ ఆజాదీ సంగ్రామ దినంగా పాటిస్తారని రైతు సంఘాల నేతలు వెల్లడిరచారు. ర్యాలీలో 5000 వాహనాల్లో 20,000 మంది రైతులు పాల్గొంటారని తెలిపారు. దీనికి సంబంధించి రైతులు రిహార్సల్స్‌ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా, తాలూకా స్ధాయిలో తిరంగా మార్చ్‌లు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img