ప్రైవేటులో మాత్రమే…
దేశవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు నిండినవారందరికీ ఇక నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. ఈ నెల 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్లు పైబడిన అందరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. అన్ని ప్రైవేటు టీకా పంపిణీ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసు పంపిణీ, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ అలాగే కొనసాగుతుందని తెలిపింది.