ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశముందని భారత వాతారవణ శాఖ హెచ్చరించింది. ఈనెల 22 వరకు ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది.