కరోనా కొత్త వేరియంట్ యావత్ ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలో అంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ గే˜బ్రెయేసస్ అన్నారు.ఇందుకోసం అందరూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. జెనీవాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రపంచంలో కలకలం సృష్టిస్తోందని, ఈ సమయంలో పండగల వేళ ఆంక్షలు తప్పనిసరిగా విధించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా చాలా వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. దీంతో ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నాపండగలు చేసుకోకపోవడం మంచిదని అన్నారు. అలాగే చాలా దేశాలలో ఇప్పటికే జనం మొదటి డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.. మరోవైపు ధనిక దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి మారాలని అన్నారు. ప్రపంచమంతా సమాంతరంగా వ్యాక్సినేషన్ జరిగితే మంచిదని అన్నారు.