Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

40వేల పైనే కరోనా కేసులు

దేశంలో కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు
దేశంలో దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది. నిన్న ఒక్కరోజే కరోనాతో మరో 593 మంది బాధితులు మృతిచెందారు. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 4,23,810 మంది మృతి చెందారు. ఇక 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,07,81,263 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉన్నాయని, ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతం ఉందని చెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img