రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషి జయంతి సందర్భంగా వారికి న్యూదిల్లీలోని అజయ్భవన్లో శుక్రవారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్, జోషి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.