Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చంద్రబాబు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు తీర్పు.. ఆ రెండు కండిషన్లు కొనసాగింపు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్‌పై మరికొన్ని షరతులు విధించాలన్న సీఐడీ పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడించింది. చంద్రబాబు రాజకీయపరమైన ర్యాలీలో పాల్గొనకూడదని.. స్కిల్ కేసుకు సంబంధించిన అంశాలను మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలు ఉండాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఈ నెల 31న విడుదలయ్యారు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబు రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని పేర్కొంది. చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీఐడీ డీఎస్పీలను నియమించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెల్లడించింది.

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మంగళవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో పాటుగా కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చంద్రబాబు తరఫు లాయర్లు.. రెగ్యులర్ బెయిల్‌కు అనుబంధంగా మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాలుగు వారాల పాటూ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రోజు తీర్పును వెల్లడించింది. అయితే మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img