Friday, December 1, 2023
Friday, December 1, 2023

చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. చంద్రబాబుకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని.. కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే చంద్రబాబుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుతో సెప్టెంబర్ 10 నుంచి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img