Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నారా లోకేష్‌పై కోడి గుడ్ల దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఇద్దరు దుండగులు కోడి గుడ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దాడి చేసిన ఇద్దరిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు.వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరిన వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. లోకేష్‌పై గుడ్ల దాడితో అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రొద్దుటూరు పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్దకు లోకేష్ పాదయాత్ర రాగానే ఈ దాడి జరిగింది. ఇద్దరు యువకులు లోకేష్‌పై కోడిగుడ్లు, రాయి విసరడంతో.. ఊహించని ఈ పరిణామానికి అంతా షాకయ్యారు. యువకుల చర్యతో టీడీపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు. కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు.. వారిని వెంబడించి పట్టుకుని చితకబాదారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసులు ఆ యువకులను అక్కడి నుంచి వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, లోకేష్‌పై కోడి గుడ్డు దాడిన ఇద్దరు యువకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇది ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేస్తామని సంఘటనా స్థలంలోనే టీడీపీ నేతలకు పోలీసులు హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేలా చేయొద్దని టీడీపీ నేతలను పోలీసులు కోరారు. ఇది ఆకతాయిల చర్యగానే చూడాలని, పార్టీల మధ్య జరిగిన వివాదంగా చూడొద్దని టీడీపీ నాయకులకు పోలీసులు సర్ది చెప్పారు. దాడికి పాల్పడింది వాళ్లే అని తేలితే కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై దాడి చేయించడం కాదని.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు దమ్ముంటే నేరుగా తన ముందుకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ కవ్వింపు చర్యల్ని అడ్డుకోకపోవడంపై లోకేష్ మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలంలోనే ఆగి నిరసన తెలిపారు. పోలీసులు సర్దిచెప్పడంతో లోకేష్ విడిది కేంద్రానికి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img