Friday, April 19, 2024
Friday, April 19, 2024

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే పాలన.. సీఎం జగన్

సెప్టెంబర్ నెల నుంచి విశాఖపట్నంలోనే పాలన కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మూలపేట తీరం వద్ద గంగమ్మ తల్లికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.4,362 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూౌ విశాఖలో సెప్టెంబర్ నుంచి అక్కడే కాపురం పెడతామన్నారు. రాష్ట్రంలో అందరికీ అమోదయోగ్యమైన నగరం విశాఖ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని, అంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img