Friday, December 8, 2023
Friday, December 8, 2023

నెలాఖరుకుగ్రూప్స్‌ నోటిఫికేషన్లు

. రెండిరటిలో వెయ్యి పోస్టుల భర్తీ
. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి : నవంబరు నెలాఖరులోపు గ్రూప్‌1, గ్రూప్‌2 నోటిఫికేషన్‌లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గ్రూప్‌-1లో 100, గ్రూప్‌-2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని, గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్‌1 ప్రక్రియను రికార్డు స్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్‌1 ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్‌ ఉంటుందని తెలిపారు. గ్రూప్‌1 మెయిన్స్‌లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్‌ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్‌లో రెండు పేపర్లుకు బదులు ఒక పేపర్‌ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబరులో 2,200 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ అధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామని సవాంగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img