Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మణిపూర్ లో అమానవీయ ఘటన.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు

ఈ కేసులో ఇప్పటిదాకా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మే4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు.మరోవైపు ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టి కాల్చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మణిపూర్‌కు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img