Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు.. దేవినేని ఉమా గృహ నిర్బంధం

నందిగామలో అర్ధరాత్రి గాంధీజీ ,ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ రెండు విగ్రహాలను తొలగించిన అధికారులు వైఎస్సార్ విగ్రహం జోలికి వెళ్లకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నందిగామకు బయలుదేరిగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.ఇంటి నుంచి బయటకు రావద్దంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మాట్లాడుతూ… కొంత మంది అధికారులు వైసీపీ నేతల చెప్పుచేతుల్లో పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ నేతల విగ్రహాలను తొలగించిన అధికారులు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహం అడ్డు కాదా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని అధికారులను ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img