Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

బోటు ప్రమాదానికి కారణాలేంటో తేల్చిన పోలీసులు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ప్రమాద ఘటన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తూ, వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పార్టీ చేసుకున్న వారు ఎవరు..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీలో ఒక యూట్యూబర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img