ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా గురువారం తాజాగా స్పందించింది. రెండు దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కెనడా పౌరుడైన నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రైవేటుగా జరిగిన దౌత్య చర్చల లోతుల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఈ అంశంపై భారత్తో మేము ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాం్ణ్ణ అని జేక్ సల్లివన్ పేర్కొన్నారు. కెనడా వివాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీతో మాట్లాడారా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ అంశంపై మాకూ ఆందోళన ఉంది. దీన్ని మేము తీవ్రంగానే పరిగణిస్తున్నాం. కేసుపై దృష్టిసారించాము. ఈ అంశంలో ఇండియాకు ప్రత్యేకమైన మినహాయింపు ఏదీ ఉండదు్ణ్ణ అని ఆయన వ్యాఖ్యానించారు.