Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వివేకా హ‌త్య‌కేసులో పురోగ‌తి శూన్యం విచార‌ణాధికారిని మార్చాల‌ని సుప్రీం ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ధర్మాసనం సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది.. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది.. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసిన రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడింది. విస్తృతస్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది.కేసు ఆలస్యం పై జస్టిస్ ఎం ఆర్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారని సీబీఐని ప్రశ్నించారు. స్టేటస్ రిపోర్టులో చెప్పిందే చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కేసుకు ఒక ముగింపు ఉండాలని.. ఇందులో విస్తృత కుట్ర ఉందని హైకోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఈ కేసులో బెయిలిచ్చే ప్రసక్తి కూడా లేదన్నారు.

కేసు మెరిట్స్ గురించి మాట్లాడదలచుకోలేదని.. 2021 నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. రాజకీయ వైరంతోనే హత్య జరిగిందని చెప్తున్నారని.. దోషిని పట్టుకునేందుకు ఇది ఒకటే సరిపోదన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి కేసు దర్యాప్తు ముగించే స్థితిలో లేనట్టుందని.. దర్యాప్తు ఇలా కొనసాగడం మంచిది కాదన్నారు. ఈ హత్యలో ఉన్న విస్తృత కుట్రను బయటకు తీయాలని.. దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ఈ అంశాలన్నీ సిబిఐ డైరెక్టర్ కు చెప్పాలని.. తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది ధర్మాసనం. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈ పిటిషన్ వేశారు. సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలని తులసమ్మ కోరారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కేసులో దర్యాప్తు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ కేసు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించించింది. ఇవాళ జరిగిన విచారణలో దర్యాప్తు అధికారిని మార్చాలని ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. సీబీఐ కొత్తగా వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img