Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

విశాలాంధ్ర బాపట్ల:స్థానిక బాపట్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాధాకృష్ణ గారికి యన్ ఆర్ జి యస్ పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి అని వినతిపత్రం అందచేసిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు.ఈ సందర్భంగా వేగేశన నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కూడా ప్రభుత్వం నరేగా,బిల్లులుచెల్లించకపోవడం ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు నిదర్శనo అని అన్నారు.తక్షణమే నరేగా బిల్లులు విడుదల చేసి కాంట్రాక్టర్లు ను ఆదుకోవాలని తేదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం పార్టీ లకు అతీతంగా రాజకీయ కక్ష్యలు మానుకొని బిల్లులు చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ,మాజీ ఎంపిపి మానం విజేత,అదే వంశీ,సురేష్ మరియు బాపట్ల నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పెండిరగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని యమ్‌ డి ఓ కు వినతిపత్రాన్ని అందజేసినవారిలో తేదేపా ఇంచార్జ్‌ వేగేశన నరేంద్ర వర్మ రాజు, తేదేపా శ్రేణులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img