విశాలాంధ్ర`తాడేపల్లి: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని గుండిమేడలో తాగు నీటి కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా తాగు నీటి సరఫరాలో ఇబ్బందులతో మోటార్లు రిపేర్లతో నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి పథకంతో పాటు, మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. స్థానికులు నీటి సమస్యపై ప్రశ్నిస్తే కార్పొరేషన్ అధికారులని సంప్రదించమని పంచాయితీ అధికారులు అంటున్నారని తెలిపారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేయమని చెపుతున్నారని స్థానికులు తెలిపారు. ఒకరిపై ఒకరు చెప్పుకోవడమే తప్ప నీటి సమస్యను పరిష్కరించలేదని స్థానికులు వాపోతున్నారు