Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొడుకుని హత్య చేసిన తండ్రి

విజయపురిసౌత్ : తండ్రి చేతిలో కుమారుడు హత్యకు గురైన సంఘటన మాచర్ల మండలం కొత్తపల్లిలో సంచలం కలిగించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెండి శ్రీను, రాములమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపి (24) ఉన్నాడు. డబ్బు విషయమై శుక్రవారం రాత్రి తండ్రి, కుమారుడు మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కుమారుడుని తలపై ఇనుపరాడ్డు తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏమిచేయాలో అర్ధం కాని తండ్రి ఎలాగైనా తెల్లారేసరికి కుమారుడి మృతదేహాన్ని మాయంచేయాలని గోనె సంచిలో కట్టాడు. తెల్లారిన తర్వాత ఆటోలో యూరియా మందు కట్టలతోపాటు ఈ గోనె సంచిని కూడా వేసి పొలానికి తీసుకెళ్ళాడు. తర్వాత జేసిబి ని పిలిచి గుంత తవ్వించాడు. జెసిబి వెళ్ళాక మృతదేహాన్ని అందులో వేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో కొందరు గ్రామస్తులకు అనుమానం వచ్చింది. విషయంపై గ్రామస్తులు గద్దించగా దారుణం బయటపడింది. ఇలా విషయం తెలుగులోకి రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా గుమిగూడారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురి సౌత్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img