‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యే ముస్తఫా
విశాలాంధ్ర`గుంటూరు వైద్యం : స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. సోమవారం 51వ డివిజన్ శ్రీనగర్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో పలు తాగునీటి వాటర్ ట్యాంకర్లను శుభ్రపరిచే విధానంపై అధికారులు చొరవచూపటం లేదని, తద్వారా తాగునీటి సరఫరాలో కొద్దిపాటి కలుషితం, దుర్వాసన, వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలుపగా, రిజర్వాయర్లను శుభ్రపరిచే విధానంపై కమిషనర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పధకాలు అమలవుతున్న విధానాలపై ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పధకాలు అందకపోతే త్వరితగతిన వారిచే దరఖాస్తులు చేయించి పధకాలు అందించాలని వలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కాల్వల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్.సజీల, 51వ డివిజన్ ఇన్ఛార్జ్ చెన్నుపాటి వెంకటరమణ, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ, మహిళా నాయకురాలు నూరి ఫాతిమా, స్థానిక నాయకులు హైదర్, వెంకటరావు, తుమ్మేటి శ్రీను, భాస్కర్, ఇమాం హుస్సేన్, సుభాని, మస్తాన్బీ తదితరులు ఉన్నారు.