Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మొక్కుబడి కోసం వెళ్ళుతూ అనంత లోకాలకి…

ప్రమాదంలో శ్రీగిరిపాడు గ్రామానికి చెందిన ఐదుగురు మృతి
గ్రామంలో విషాదచాయలు

విశాలాంధ్ర`వెల్దుర్తి : దైవదర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లో వెళితే మండల పరిధిలోని సిరిగిరిపాడు గ్రామానికి చెందిన జూలకంటి నాగిరెడ్డి(24) లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి మొక్కుబడులు తీర్చుకోవడానికి స్వగ్రామానికి వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళుతూ మార్గమధ్యంలో ప్రకాశం జిల్లా కంభం వద్ద లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే తనతోపాటు తాత చిలుకూరు హనీమిరెడ్డి(60), అమ్మమ్మ ఆదిలక్ష్మి(55), చిన్నమ్మలు భూమిరెడ్డి గురవమ్మ(53), పల్లె అనంత రావమ్మ(50)లు మృత్యువాత పడ్డారు. వీరితోపాటు మరో వాహనంలో బయలుదేరి వెళ్లిన 9 మంది బంధువులు విషయాన్ని గ్రామానికి చేరవేశారు. బయలుదేరిన మూడు గంటలకే తమ వాళ్ళు మృత్యువాత పడ్డారని సమాచారం అందుకున్న బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో కన్నీటి చాయలు అలుముకున్నాయి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img