విశాలాంధ్ర`రేపల్లె : అగ్నిప్రమాదం సంభవించి పది ఇళ్లు, మూడు గేదలు కాలిపోయిన సంఘటన నగరం మండలం ధూళిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన జరిగిన ప్రాంతానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణా రావు చేరుకుని బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద కుటుంబానికి రూ.10 వేలు ప్రభుత్వం తరుపున ప్రకటించారు. ఇదే కాక వారికి కావాల్సిన సహాయాన్ని అందించవలసిందిగా స్థానిక తహశీల్థార్ను ఆదేశించారు.