Friday, April 19, 2024
Friday, April 19, 2024

సీటిచ్చి ఓడించారు

మానసిక హత్య చేశారు
మీడియా ఎదుట గంజి చిరంజీవి కన్నీటిపర్యంతం

సీటు ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరి ప్రెస్ క్లబ్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.టిడిపిలో కొందరు నాయకులు తనను మానసికంగా హత్య చేశారని బీసీ నేతనైన తనను అవమానాలకు గురి చేశారని పేర్కొంటూ కన్నీటి పర్యంత మయ్యారు.అవమాన భారం భరించలేకనే పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విషయంలో తానెప్పుడూ వెనకాడబోనని స్పష్టం చేశారు ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img