విశాలాంధ్ర`నరసరావుపేట : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి, పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని అతను చేసిన ఆకృత్యాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్లో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదని విమర్శించారు. గతంలో మీసం తిప్పి చూపించాడని జగన్ రెడ్డి గోరంట్ల మాధవ్కు ఎంపీ టికెట్ ఇచ్చారని, ఇప్పుడు చేసిన దానికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అని ఎద్దవా చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా చేసినందున మహిళలు ఉవ్వెత్తున దాడి చేసే అవకాశలున్నాయన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే పార్టీ నుంచి గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అవాస్తవాలు రాసే పత్రికలపై జగన్మోహన్ రెడ్డి దాడులు చేయాలనడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని వారి చరిత్రలు, వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని సూచించారు.