Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహం కాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్దిగా పండుతున్నాయని తెలిపారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారిని, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి, అంబర్‌ పేట్‌ మహంకాళి అమ్మవార్లను దర్శించుకుని, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img