విశాలాంధ్ర-బషీర్ బాగ్ : సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ల కోసం పార్లమెంట్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమో దించాలని సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన సమ న్యాయం అనే హక్కు దేశ ప్రజలందరికీ, ఈ రీజినల్ బెంచ్ల వల్ల అందుబాటులోకి వస్తుందని తెలి పారు. నల్లకుంటలోని సౌత్ ఇండియా జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న వర్ష కాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందేలా పాలక, ప్రతిపక్షం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలంగా సౌతిండియాలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ పోరాటంలో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజూ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సౌతిండియా పార్లమెంటరీ సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సూచించిన రీజినల్ బెంచ్ ఏర్పాటును, సరైన కారణాలు లేకుండా తిరస్కరించడాన్ని పార్లమెంట్ స్టాండిరగ్ కమిటీ ఒప్పుకోలేదని, అందువల్ల రీజినల్ బెంచ్ల ఆవశ్యకతను తెలియజేస్తూ మళ్లీ తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు పంపించాయని ఆయన తెలిపారు. రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయకపో వడం వల్ల మారుమూల ప్రజలకు సుప్రీంకోర్టు వల్ల న్యాయం పొందే హక్కు కోల్పోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సూచించిందన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ సభ్యులు వాకిటి వెంక టేశం, పెండెం సతీష్, మోహన్ రావు, వెంకటేశ్, మల్లిఖార్జున్, జ్యోతిరావు, మొజోంఖాన్, శ్రీనివాస్, శారదా, వెంకట్, పిఎన్.శర్మ, తీగె సత్యనారా యణ, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.