Sunday, July 20, 2025
Homeజిల్లాలువిజయనగరంఆపరేషన్ షేప్ క్యాంపస్ జోన్ పేరుతో తనిఖీలు

ఆపరేషన్ షేప్ క్యాంపస్ జోన్ పేరుతో తనిఖీలు

విశాలాంధ్ర. విజయనగరం జిల్లా.రాజాం : రాజాం టౌన్, రూరల్ పోలీసులు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా పాన్ షాపు లలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. విద్యా సంస్థలకు దగ్గర్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మేవారికి హెచ్చరికలు జారీ చేస్తూ… ఫైన్ వేశారు.18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రగ్స్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. ప్రజలలో పోలీసులు ఉన్నారని ధైర్యం పెంచడానికి, చట్టవ్యతిరేక కార్యక్రమాలు పాల్పడేవారికి భయం పెంచే విధంగా పోలీసులు కార్యక్రమాలు ఉంటాయన్నారు. తనిఖీలను నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ రాఘవులు అన్నారు. చుట్టు పక్కల ప్రాంతాలలో ఎక్కడైన గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు