మాస్కో: దేశంలో అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రష్యన్ కమ్యూనిస్టులు పుష్కిన్ స్క్వేర్ వద్ద నిరసనకారులు ప్రతిన పూనారు. దేశంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తాజాగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్కు వ్యతిరేకంగా, బ్యాలెట్ రిగ్గింగ్ ఆరోపణలపై వీరు నిరసన చేపట్ట్టారు. తమపై అరెస్టులకు, బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. డ్యుమాలోని అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్(సీపీఆర్ఎఫ్) గత వారం మాస్కోలో జరిగిన ఎన్నికల ఫలితాల గుర్తింపును నిరాకరించింది. అనేక ప్రాంతాల్లో యునైటెడ్ రష్యా అభ్యర్థికి అనుకూలంగా బ్యాలెట్స్ మార్పు జరిగిందని ఆరోపించారు. కమ్యూనిస్టులకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సీపీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి గెన్నడి జుగనోవ్ ప్రభుత్వ చర్యలను, పార్టీ వెబ్సైట్ను బ్లాక్ చేస్తామని ప్రభుత్వం అసమ్మతిని,అణచివేత చర్యలకు, బెదిరింపులను నిరసనకారులు త్రీవంగా ప్రతిఘటించారు. ర్యాలీలో వక్తలు పెట్టుబడీదారీ పాలనకు వ్యతిరేకంగా దోపిడీ విధానాన్ని ఖండిరచారు. మాస్కోలో ఎన్నికలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.