ఇస్లామాబాద్: ఓ మహిళా న్యాయమూర్తిని బెదిరించిన కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఈ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ అయింది. ఇమ్రాన్ గత ఆగస్టులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళా న్యాయమూర్తి జేబా చౌదరిని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతంలోనే కోర్టు ఇమ్రాన్కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నెల 24న జరిగిన విచారణలో కోర్టు దాన్ని బెయిలబుల్ వారెంటుగా మార్చింది. బుధవారం నాటి విచారణకు ఇమ్రాన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఏప్రిల్ 18న ఇమ్రాన్ను కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.