ఇస్లామాబాద్ : అధికారంలో ఉండగా విదేశీ నేతల నుండి అందుకున్న కానుకల గురించి అధికారులను తప్పుదోవ పట్టించారన్న అభియోగాలపై పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను రాజకీయ పదవుల నుండి ఐదేళ్లపాటు అనర్హులుగా పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం రూలింగ్ ఇచ్చింది. గత ఏప్రిల్ 10న ఖాన్ బర్తరఫ్కు ముందునుండే ప్రారంభమైన రాజకీయ బాధింపులకు, మాజీ అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజం చేస్తున్న అనేక పోరాటాలకు, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ఎ
ఇన్సాఫ్ (పీటీఐ)కు ఈ కేసు మరో మలుపు. రాజకీయ ప్రతిపక్షాన్ని నిర్మూలించడానికి వ్యవహారాలను సాగతీసేందుకు శాసనకర్తలు కోర్టులను తరచుగా ఉపయోగించుకుంటారని హక్కుల పర్యవేక్షకులు విమర్శిస్తారు. అయితే, ఎన్నికైన అధికారాలు వారి ఆస్తులన్నింటినీ ప్రకటించాలన్న విధిధర్మ నుండి ఈ కేసులో ఎన్నికల సంఘం ప్రమేయం జరిగింది. ‘‘పాకిస్థాన్ ఎన్నికల సంఘం కోర్టుకాదు. అందుచేత, ఎవరినీ అనర్హులుగా ప్రకటిస్తూ వారు డిక్లరేషన్ ఇవ్వలేరు’’ అని ఖాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పీటీఐ సెనేటర్, న్యాయవాది అయిన సయ్యద్ అలీ జఫర్ ఎన్నికల సంఘం రూలింగ్ ఇవ్వడానికి ముందుగా శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. మొఘల్ శకంలో ‘‘సంపద గృహాలు’’గా ప్రస్తావించబడిన ‘తోషాఖానా’’గా ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ విభాగంపై ఈ కేసు కేంద్రీకృతమైంది. అన్ని విలువైన వస్తువులు తప్పక తోషాఖానాకు వెళ్ళాలి. అయితే, కొన్నింటి విషయంలో బహుమతి గ్రహీత వస్తువుల విలువలో దాదాపు 50శాతం చెల్లించి వాటిని కొనుగోలు చేయవచ్చు. అయితే ఖాన్ అధికారంలో ఉండగా 20శాతం మాత్రమే చెల్లించి వస్తువులు తమవద్ద ఉంచుకున్నారు.