గ్రీసు కమ్యూనిస్టు పార్టీ
ఏథెన్స్ : గ్రీస్లో గత వారం రోజులుగా మంటలకు, కార్చిచ్చులకు ఇప్పటివరకు పాలించిన అన్ని ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) పేర్కొంది. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని ఈవియా, అట్టికా, పెలోపొన్సీస్లలో కొనసాగుతున్న ఘోరమైన అగ్నిప్రమాదాలపై ప్రభుత్వాలదే బాధ్యతని నొక్కి వక్కాణించింది. 2000 లో 1.6 మిలియన్ల ఎకరాలు అగ్నికి ఆహుతికాగా 2007లో 2.6 మిలియన్ల ఎకరాలు కాలి బూడిదవగా, 89 మరణాలు నమోదయ్యాయి. 2018లో 102 మంది మరణించగా 194 వేల ఎకరాలు కాలిపోయాయి. 1993 నుంచి అడవి మంటలు కారణంగా 39 మంది అగ్నిమాపక సిబ్బందితో సహా 248 మంద్రి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7.17 ఎకరాల భూమి తగలబడిపోయింది. గ్రీకు ప్రభుత్వాలు నాటో కూటమి సైనిక ఖర్చులకోసం ప్రతిసంవత్సరం బిలియన్ల యూరోలు ఖర్చు చేస్తుండగా..అగ్ని రక్షణ కోసం నిధులను ప్రభుత్వం తగ్గించిందని కేకేఈ గుర్తు చేసింది. ఫ్రాన్స్ నుండి రాఫెల్ జెట్ల కొనుగోలుకు 1.9 బిలయన్ యూరోలు ఖర్చు చేస్తుండగా, 120 మిలియన ్యూరోలు ప్రైవేటు యాజమాన్యంలోని ఏజియన్ ఎయిర్లైన్స్కు మద్దతుగా, 30 మిలియన్ యూరోలు యూనివర్సిటీ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుకోసం ఖర్చు చేస్తోందని కేకేఈ ప్రస్తావించింది. ప్రజలు అగ్ని ప్రమాదాలకు లోనుకాకుండా నివాసప్రాంతాల్లోనూ, ఇళ్లు, అడవులు, అటవీ ప్రాంతాల్లో ఫైర్ ఫ్రంట్కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పార్లమెంటులోను, ప్రాంతీయ, మునిసిపల్ కౌన్సిల్లో కేకేఈ కేడర్లు, సహాయకులు మంత్రులు, గవర్నర్లు, మేయర్లతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలకు, అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వాలు తక్షణ ఉపశమనం అందించాలని ప్రజలకు అవసరమైన సహాయాన్ని దేశం అందించాలని కేకేఈ డిమాండ్ చేసింది.