హైదరాబాద్ : మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కిన్నెరసాని’ చిత్రంతో మలయాళ బ్యూటీ శీతల్ కదానాయికగా నటిస్తోంది. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతోంది. శీతల్.. చిన్నవయసులోనే మోడలింగ్ ప్రారంభించింది. 2012లో జవాన్ ఆఫ్ వెల్లిమల చిత్రంతో సినిమారంగంలో అడుగుపెట్టింది. పలు తమిళ చిత్రాల్లోనూ మెరిసింది. 2017లో ‘ఎజ్రా’, 2019లో ‘ఇష్క్’, 2019లో ‘కాళిదాస్’ చిత్రంలో నటించింది.