హవానా : క్యూబా రాజధాని హవానాలో జరిగిన తాజా సమావేశంలో క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ (పీసీసీ), గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ)లు తమ సోదర సంబంధాలను పునరుద్ఘాటించుకున్నాయి. ఈ సమావేశానికి హాజరైన కేకేఈ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, ఎంపీ యోర్గోస్ మారినోస్ నేతృత్వంలోని కేకేఈ ప్రతినిధి బృందాన్ని క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఉపాధ్యక్షుడు రాబర్టో మోరేల్స్ ఓజెడా స్వాగతించారు. క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనానికి వ్యతిరేకంగా తమ నిరంతర పోరాటానికి మోరేల్స్ ఓజెడా మద్దతు ప్రకటించారు. క్యూబాపై అమెరికా మిత్రదేశాల జోక్యాన్ని తిరస్కరించడానికి ముందుకు వచ్చిన ప్రధాన పార్టీలలో, గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ (కేకేఈ) ఒకటని మోరేల్స్ ఒజెడా నొక్కిచెప్పారు. ఏప్రిల్ 2021లో జరిగిన పీసీసీి 8వ కాంగ్రెస్ నిర్ణయాలను అనుసరించి అభివృద్ధి చెందుతున్న రాజకీయ ప్రక్రియలు, శాంతి, ఆర్థిక, సైద్ధాంతిక మూడు ప్రధానమైన వాటిని నెరవేర్చడానికి క్యూబా ప్రభుత్వం చేసిన పోరాటాన్ని చర్చించారు.అక్టోబర్లో హవానాలో జరగనున్న కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల (ఐఎమ్సీడబ్ల్యుపీ) 22వ అంతర్జాతీయ సమావేశంపై రెండు పార్టీలు చర్చించాయి.