Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

క్షేమంగా తిరిగివచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: 90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు రోదసీ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంత రిక్షకేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం శుక్రవారం క్షేమంగా తిరిగి వచ్చింది. వీరు రెండుస్పేస్‌ వాక్స్‌ కూడా చేశారు. సుదీర్ఘకాలం సిబ్బందితో కూడిన రోదసీయానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన చైనీయులుగా రికార్డు నమోదుచేశారు. షెంఘౌ 12 మాన్డ్‌ స్పేస్‌షిప్‌ రిటర్న్‌ కాప్సూల్‌ ఉత్తర చైనాలోని మంగోలియా అటానమస్‌ ప్రాంతంలో భూమికి చేరింది. ఇందులో వ్యోమగాములు నీయ్‌ ఫైషెంగ్‌, లియు బోమిగ్‌, టాంగ్‌ హోంగ్బో ఉన్నారు. షెంరaౌ 12 మ్యాన్డ్‌ స్పేస్‌షిప్‌ రిటర్న్‌ క్యాప్సూల్‌ భూమి వాతావరణంలోకి వచ్చిందని అంతకుముందు చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. దీని ప్రధాన ప్యారాచూట్‌ విజయవంతంగా కిందకుదిగిందని, అది దిగే వేగం నెమ్మదిగా తగ్గిందని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రొపెల్లెంట్‌ నుంచి రిటర్న్‌ మాడ్యూల్‌ విడిపోయిందని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సున్నితంగా జరిగిందని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. షెంరaౌ 12 మానవ సహిత రోదసి నౌకను చైనా జూన్‌లో పంపించింది. చైనా పంపిన మానవులతో కూడిన రోదసి నౌకల్లో ఇది ఏడోదని చైనా మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img